MOVIE NEWS

ఉస్తాద్ భగత్ సింగ్ : సెకండ్ హీరోయిన్ ఎంట్రీ.. తేరి రీమేక్ ఖాయమేనా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్..టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు.దర్శకుడు హరీష్ శంకర్ రీమేక్స్ చేయడంలో ఎక్స్పర్ట్..ముందుగా ఈ సినిమా మొదలైనప్పుడు తమిళ్ సూపర్ స్టార్ విజయ్ హీరోగా నటించిన, అట్లీ డైరెక్ట్ చేసిన తేరి అనే సినిమాకి రీమేక్‌గా మొదలుపెట్టారు… అయితే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ కావడంతో సినిమా షూటింగ్ నిలిచిపోయింది. ఈ నేపథ్యంలోనే హిందీలో అదే సినిమాను ‘బేబీ జాన్‌’గా రీమేక్ చేయగా ఆ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది.దీంతో దర్శకుడు హరీష్ శంకర్ ఈ సినిమాను సీన్ టూ సీన్ రీమేక్ చేయకూడదని నిర్ణయించుకున్నారు..

“వీరమల్లు” కథ ఇదే.. పవన్ కళ్యాణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!

ఈ సినిమాకి సంబంధించి అనేక మార్పులు, చేర్పులు చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం షూటింగ్ శర వేగంగా జరుగుతుంది..అయితే ఒక హీరోయిన్‌తోనే మొదలైన ఈ సినిమాలోకి ఇప్పుడు మరో హీరోయిన్ రంగంలోకి దిగింది. హీరోయిన్ ఒక్కరే అనుకున్న సమయంలో తేరి సినిమాకి పూర్తి భిన్నంగా ఈ సినిమా ఉంటుందని అంతా భావించారు. కానీ ఇప్పుడు రాశి ఖన్నా కూడా ఈ సినిమాలోకి ఎంట్రీ ఇవ్వడంతో ఈ సినిమా కూడా తేరికి దగ్గరగానే ఉంటుందా అనే అనుమానాలు మొదలయ్యాయి.

ఒరిజినల్ సినిమాలో విజయ్ భార్య పాత్రలో సమంత నటించగా, టీచర్ పాత్రలో అమీ జాక్సన్ నటించింది. ఇప్పుడు ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ భార్య పాత్రలో రాశి ఖన్నా, టీచర్ పాత్రలో శ్రీ లీల నటించే అవకాశం ఉందని సమాచారం.. ఈ సినిమా షూటింగ్ నుంచి లీకైన కొన్ని ఫోటోలు, వీడియోలు కూడా దీనిపై క్లారిటీ ఇచ్చాయి..దీనితో ఫ్యాన్స్ సైతం దర్శకుడిని రీమేక్ చేయొద్దని రిక్వెస్ట్ చేస్తున్నారు…

Related posts

NTR-NEEL : భారీ స్థాయిలో సెకండ్ షెడ్యూల్.. నీల్ మావ ప్లాన్ అదిరిందిగా..!!

murali

గ్లోబల్ స్టార్ బర్త్డే ఫ్యాన్స్ కి బిగ్ సర్ ప్రైజ్..!!

murali

చరణ్ తో సందీప్ రెడ్డి వంగా.. క్రేజీ కాంబో సెట్.. ఫ్యాన్స్ కి పండగే..?

murali

Leave a Comment