పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘హరి హర వీరమల్లు’. ఈ సినిమాలో పవర్ స్టార్ ధర్మం కోసం పోరాడే యోధుడి పాత్రలో నటించారు..ఈ బిగ్గెస్ట్ పీరియాడికల్ మూవీని ఎ.ఎం. జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి తెరకెక్కించారు…హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది.. బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ ఈ సినిమాలో విలన్ గా నటించారు.గత కొన్నేళ్లుగా షూటింగ్ జరుపుకున్న ఈ బిగ్గెస్ట్ మూవీ జూలై 24న గ్రాండ్ గా విడుదల కానుంది.‘హరి హర వీరమల్లు’ సినిమాపై ప్రేక్షకులలో అంచనాలు భారీగా ఉన్నాయి.
పెద్ది : చరణ్ లేటెస్ట్ లుక్ అదిరిపోయిందిగా..!!
తాజాగా మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించి బిగ్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది..ఈ ప్రెస్ మీట్ కు పవన్ కళ్యాణ్ సైతం హాజరయ్యారు..ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ‘కృష్ణా నది తీరంలో కొల్లూరులో దొరికిన కోహినూర్ వజ్రం హైదరాబాద్ సుల్తాన్ల దగ్గరకు ఎలా వచ్చింది.. ఆ తర్వాత ప్రయాణం ఎలా జరిగింది..ఈ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. దీనికి పునాది వేసింది దర్శకుడు క్రిష్ జాగర్లమూడి. ఒక మంచి కాన్సెప్ట్ తో ఆయన వచ్చారు. ఆయన, రత్నం వచ్చి ఈ కథ చెప్పినప్పుడు నచ్చి వెంటనే నేను ఓకే చేశాను. అయితే కరోనా అనేది సినిమాపై తీవ్ర ప్రభావం చూపించింది.
నేను ఎ.ఎం. రత్నంని దగ్గరనుండి చూశాను. ఒకప్పుడు ఆయన వెంట నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, హీరోలు, దర్శకులు తిరిగేవారు. ఖుషి సినిమా సమయంలో మాకు ఒక నెల ముందే ప్రీ ప్రొడక్షన్ అయిపోయింది. మాకు ఆయన అంత సౌకర్యాన్ని ఇచ్చారు. అలాంటి వ్యక్తి నలిగిపోతుంటే నాకు బాధేసింది. ఇది డబ్బు గురించో, విజయం గురించో కాదు మన వాళ్ళ కోసం, సినీ పరిశ్రమ కోసం నమ్మి నిలబడటం. కొన్ని కారణాల వల్ల క్రిష్ గారు ఈ సినిమా పూర్తి చేయలేకపోయినప్పటికీ ఒక మంచి కాన్సెప్ట్ తో ఈ సినిమాకి పునాది వేసిన ఆయనకు మనస్ఫూర్తిగా కృతఙ్ఞతలు’ అని పవన్ కళ్యాణ్ అన్నారు..
