మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ తో కలిసి నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ వార్ 2. బాలీవుడ్ హాట్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. ఆయన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిల్మ్స్ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తుంది.. ఈ సినిమా నుండి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, గ్లిమ్స్ సినిమాపై అంచనాలు భారీగా పెంచేశాయి.ఈ భారీ బడ్జెట్ చిత్రం ఈ ఏడాది ఆగస్టు 14 న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది.
దసరా కు రిలీజ్ అయ్యే భారీ సినిమాలు ఇవేనా..?
ఈ సినిమా తెలుగు డబ్బింగ్ రైట్స్ ను టాలీవుడ్ యంగ్ ప్రొడ్యూసర్ సితార ఎంటర్టైన్మెంట్స్ నాగవంశీ కొనుగోలు చేసారు. ఈ విషయాన్నీ అధికారకంగా ప్రకటిస్తూ వీడియో కూడా రిలీజ్ చేసారు. దాదాపు రూ. 90 కోట్లకు ఈ డీల్ క్లోజ్ అయిందని సమాచారం. డబ్బింగ్ సినిమాలలోనే అత్యధిక రేటు పలికిన సినిమాగా వార్ 2 నిలిచింది. అరవింద సమెత వీర రాఘవ, దేవర తో నాగవంశీ భారీగా లాభాలు పొందాడు.. తాజాగా తన బ్యానర్ లో ఎన్టీఆర్ కాంబోలో రిలీజ్ అవుతున్న మూడవ సినిమా కావడంతో వార్ 2 పై భారీ అంచనాలు వున్నాయి..
తెలుగులో వార్ 2 కు అంత భారీ డిమాండ్ రావడానికి కారణం ఎన్టీఆర్ అని చెప్పాలి. కాగా వార్ 2 తెలుగు రిలీజ్ కోసం నాగవంశీ భారీ ప్లానింగ్ చేస్తున్నాడు. దేవర కోసం ఏ రేంజ్ లో ఏర్పాట్లు చేసారో అంతకు మించి వార్ 2 రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తుంది.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా ఈ సినిమా కోసం ఎంతో ఈగర్ గా ఎదురు చూస్తున్నారు.
