తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘కూలీ’. తమిళ టాప్ దర్శకుడు లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉన్నాయి.ఇప్పటికే జైలర్ సినిమాతో సూపర్ కం బ్యాక్ ఇచ్చిన తలైవా.. ఈ సినిమాతో మరో భారీ హిట్ అందుకోవాలని చూస్తున్నారు.. ఈ సినిమాలో అక్కినేని నాగార్జున, బాలీవుడ్ స్టార్ అమిర్ ఖాన్,కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర, మలయాళ నటుడు సౌబిన్ సాహిర్, కట్టప్ప సత్యరాజ్ వంటి స్టార్స్ నటిస్తున్నారు.. ఈ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ ఆగస్టు 14న వరల్డ్ వైడ్ గా ఎంతో గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపధ్యంలో మేకర్స్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసారు.. రీసెంట్ గా ఈ చిత్రం నుండి చికిటు అనే ఫస్ట్ లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు.తెలుగులోను ఈ సినిమాను భారీ ఎత్తున రిలీజ్ చేయబోతున్నారు.
‘వార్ 2’ షూటింగ్ పూర్తి.. హృతిక్ ఎమోషనల్ పోస్ట్ వైరల్..!!
కూలీ సినిమా తెలుగు హక్కులను ఆసియన్ సురేష్ రూ. 45 కోట్లకు కొనుగోలు చేసారు. అయితే తెలుగు స్టేట్స్ లో భారీ ఓపెనింగ్ రాబట్టాలంటే ఇప్పుడున్న బజ్ అయితే సరిపోదు. అందుకోసం రజినీ రంగంలోకి దిగాలి. ఈ నేపధ్యంలోనే కూలీ తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించేందుకు మేకర్స్ ఏర్పాట్లు చేస్తున్నారు. అందుకోసం ఆగస్టు 7 న ఓ భారీ ఈవెంట్ ను మేకర్స్ ప్లాన్ చేసారు..ఈ ఈవెంట్ కు సూపర్ స్టార్ రజనీకాంత్ తో పాటు లోకేష్ కనగరాజ్, అక్కినేని నాగార్జున హాజరుకానున్నారు.
కూలీ నుండి సెకండ్ లిరికల్ సాంగ్ ను ఈ వచ్చే వారం విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అక్కినేని నాగార్జున, పూజ హెగ్డే కాంబోలో ఈ సాంగ్ రానుందని తెలుస్తుంది. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ ఈ సినిమాకు అదిరిపోయే మ్యూజిక్ అందించారు..లియో రేంజ్ లో ఈ సినిమా కూడా సూపర్ హిట్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారు..
