సూపర్ స్టార్ మహేష్, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. “SSMB” అనే వర్కింగ్ టైటిల్ తో తెరకక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు వున్నాయి.. ఈ సినిమాను దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ ఏకంగా 1000 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నాడు.. బిగ్గెస్ట్ అడ్వెన్చరస్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో హాలీవుడ్ స్టార్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుంది.. ఇటీవల సీక్రెట్ గా పూజా కార్యక్రమాలు పూర్తి చేసిన చిత్ర యూనిట్ రీసెంట్ గా రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలు పెట్టింది..
ఎంత మంది వున్నా ఆయనే నా ఫేవరెట్.. ఐశ్వర్య రాజేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!
షూటింగ్ లో ఎలాంటి లీక్స్ జరకగకుండా రాజమౌళి స్ట్రిక్ట్ రూల్స్ పెట్టాడు.. అందరూ ఈ రూల్స్ పాటించేలా చూసుకుంటున్నాడు.. రాజమౌళి సినిమా అంటే స్టార్ హీరోలు సైతం వణికిపోతారు.. ఏది ఒక పట్టాన ఒప్పుకోడు..ఒక్కసారి ఆయనతో సినిమా కమిట్ అయితే చాలు.. షూటింగ్ పూర్తయ్యే వరకు ప్రతి ఒక్కరు ఆయన మాట వినాల్సిందే.ఎంత పెద్ద స్టార్ హీరో అయినా సరే జక్కన్న పెట్టే కండీషన్స్ కచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే. మహేష్ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండటంతో ఖర్చుల దగ్గర జక్కన్న చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడని సమాచారం.అనవసరపు ఖర్చులు తగ్గించి, ఆ డబ్బంతా సినిమా క్వాలిటీ కోసం ఖర్చు చేయబోతున్నారని తెలుస్తుంది..
ఈ నేపథ్యంలో జక్కన్న ఓ కీలక నిర్ణయం తీసుకున్నారట.సెట్లో ప్లాస్టిక్ని పూర్తిగా నిషేదించారని సమాచారం.. ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ని సెట్లోకి అనుమతించట్లేదు..మహేశ్బాబుతో సహా ప్రతి ఒక్కరు ఈ రూల్ని కచ్చితంగా పాటించాల్సిందేనని తెలుస్తుంది..షూటింగ్లో రోజుకు దాదాపు రెండు వేల మంది వరకు పాల్గొంటున్నట్లు సమాచారం.. అంత మందికి వాటర్ బాటిళ్లు అందించడం అంటే చాలా ఖర్చు అవుతుంది. అందుకే సెట్లో గాజు బాటిళ్లను ఏర్పాటు చేయిస్తున్నారని తెలుస్తుంది..