ఆర్ఆర్ఆర్ సినిమాతో సంచలన విజయం అందుకున్న దర్శకధీరుడు రాజమౌళి తన తరువాత సినిమాను సూపర్ స్టార్ మహేష్ తో చేస్తున్న సంగతి తెలిసిందే.. వీరిద్దరి కాంబో లో వచ్చే ఈ సినిమా ఊహించని రేంజ్ లో ఉంటుందని సమాచారం.. “SSMB29” అనే వర్కింగ్ టైటిల్తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని దుర్గా ఆర్ట్స్ బ్యానర్పై కె.ఎల్. నారాయణ సుమారు 1000 కోట్ల భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. మహేశ్ – రాజమౌళి కాంబోలో వస్తున్న తొలి చిత్రం కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి.
స్టైలిష్ లుక్ లో ఎన్టీఆర్.. ఈ సారి మరింత కొత్తగా..!!
ఈ సినిమాలో గ్లోబల్ బ్యూటీ ప్రియంకా చోప్రా హీరోయిన్గా నటిస్తుంది. అలాగే మలయాళ స్టార్ యాక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ సినిమాలో విలన్ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఒడిషా షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ మూవీ షూటింగ్కి సంబంధించి తాజా అప్డేట్ వచ్చింది.ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుండగా.. తదుపరి షెడ్యూల్లో భాగంగా నీటిలో ఒక భారీ బోట్ యాక్షన్ సీక్వెన్స్ను చిత్రీకరించేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.
ఈ షెడ్యూల్లో మహేశ్ బాబు, ప్రియాంకా చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్తో పాటు సుమారు 3 వేల మంది జూనియర్ ఆర్టిస్ట్లు కూడా పాల్గొననున్నారని సమాచారం. వీరంతా ఈ సన్నివేశం కోసం ప్రత్యేక శిక్షణ తీసుకోనున్నట్లు తెలుస్తోంది.ఈ సీక్వెన్స్ను మే నుంచి జూన్ వరకు చిత్రీకరించబోతున్నారు. అయితే ఈ భారీ యాక్షన్ సీక్వెన్స్ కోసం హైదరాబాద్లో ఒక భారీ సెట్ను సిద్ధం చేస్తున్నారని సమాచారం.. ప్రముఖ హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ల నేతృత్వంలో ఈ యాక్షన్ సన్నివేశాన్ని షూట్ చేయనున్నట్లు తెలుస్తోంది.ఇంటర్నేషనల్ రేంజ్ లో రూపొందుతున్న ఈ సినిమా మహేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ మూవీ గా తెర కెక్కుతుంది..