టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్,యానిమల్.. వంటి మూడే మూడు సినిమాలు తీసి ఇండియన్ సినిమా ఇండస్ట్రీని షేక్ చేసాడు..సందీప్ రెడ్డి వంగా ఏడేళ్లలో డైరెక్టర్గా తనదైన మార్కు చూపించారు. ‘యానిమల్’ మూవీ సందీప్ వంగా కెరీర్ ని ఒక మలుపు తిప్పింది.సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ సైతం సందీప్ తన కంటే గొప్ప దర్శకుడు అంటూ కితాబు ఇచ్చారు రన్ బీర్ కపూర్ హీరోగా నటించిన ఈ యానిమల్ మూవీ భారీ విజయాన్ని సొంతం చేసుకొని అదిరిపోయే కలెక్షన్లు సాధించింది. అయితే ఈ సినిమాపై క్రేజ్ ఏ విధంగా వచ్చిందో విమర్శలు కూడా అంతే స్థాయిలో వచ్చాయి..కొందరు సినీ ప్రముఖులు ఈ సినిమాపై విమర్శలు కురిపించిన సంగతి తెలిసిందే. ఈ విషయం పై సందీప్ రెడ్డి వంగ చాలా సార్లు స్పందించనప్పటికి.. తాజాగా ఈ విషయంపై మరోసారి ఓ ఇంటర్వ్యూలో సందీప్ వంగా స్పందించారు. అలాగే ‘యానిమల్’ సీక్వెల్ గురించి కూడా అప్ డేట్ ఇచ్చాడు.
డాకు మహారాజ్ : అక్కడి ప్రేక్షకులకు బాలయ్య సినిమా తెగ నచ్చేసిందిగా..!!
సందీప్ రెడ్డి వంగా మాట్లాడుతూ..యానిమల్ ని విమర్శించినవారంతా రణ్ బీర్ను మాత్రం తెలివైన వ్యక్తి అని అన్నారు. ఎవరూ ఆ పాత్ర చేసిన హీరోను విమర్శించలేదు. నాకు ఈ విషయంలో అసూయ అయితే లేదు కానీ రణ్ బీర్ తెలివైన వ్యక్తి అయితే మరి రచయిత, దర్శకుడి పరిస్థితి ఏమిటి అనేది తెలియాలి..నాకు ఈ తేడా ఇప్పటికీ అర్ధంకాలేదు. వారంతా రణ్ బీర్ తో కలిసి వర్క్ చేయలనుకుంటున్నారు. కాబట్టి అతనిని ఏమీ అనలేదు. నేను పరిశ్రమకు కొత్త కనుక నన్ను విమర్శిస్తున్నారు ఇది ఎవ్వరూ ఒప్పుకోని నిజం అని సందీప్ అన్నాడు.
అలాగే ‘యానిమల్ పార్క్” కోసం చాలా మంది ఎదురుచూస్తున్నారని నాకు తెలుసు. యానిమల్ ని మూడు భాగాలుగా తెరకెక్కించాలని అనుకుంటున్నా స్క్రిప్ట్ రాసుకున్నప్పుడే నాకు ఈ ఆలోచన ఉంది. ఇక ఈ యానిమల్ పార్క్ లో రణ్ బీర్ డ్యూయల్ రోల్ చేయనున్నారని సందీప్ తెలిపారు… హీరోగా, విలన్ గా రన్ బీర్ నటిస్తారు.. ఈ సారి కూడా అందరూ ఆశ్చర్యపోయేలా ఈ సినిమా ఉంటుంది అని సందీప్ చెప్పుకొచ్చాడు..