బాలీవుడ్ లో ఎంతో ప్రతిస్టాత్మకంగా రూపొందుతున్న బిగ్గెస్ట్ మూవీ ‘రామాయణ’. ఈ బిగ్ ప్రాజెక్ట్లో కన్నడ స్టార్ హీరో యష్ రావణాసురుడిగా నటిస్తుండగా బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ శ్రీరాముడి పాత్రలో, టాలీవుడ్ క్యూట్ బ్యూటీ సాయి పల్లవి సీత పాత్రలో నటిస్తోంది.అయితే ఇటీవలే ఈ చిత్రం నుండి చిన్న గ్లింప్స్ రిలీజ్ చేయగా ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ వచ్చింది..ఇందులో రాముడిగా రణ్ బీర్ కపూర్ లుక్, రావణుడిగా యష్ లుక్ ప్రేక్షకులకు ఎంతగానో నచ్చింది.. ఇదిలా ఉంటే రాక్షస రాజు రావణాసురుని భార్య మండోదరి పాత్రలో కాజల్ అగర్వాల్ ఎంపికైనట్టు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
రాజాసాబ్ : తమన్ వర్క్ డార్లింగ్ కు నచ్చలేదా..?
కానీ తాజాగా ఈ ప్రాజెక్ట్ నుండి కాజల్ ని తప్పించినట్లు బాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది… ఆమె స్థానంలో ఇప్పుడు మృణాల్ ఠాకూర్ ఎంపికైందనే న్యూస్ సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారింది. క్యూట్ బ్యూటీ కాజల్ అగర్వాల్ ‘మండోదరి’ పాత్రలో నటిస్తే, సీత పాత్రలో నటించే సాయి పల్లవిని రావణాసురుడైన యష్ ఎందుకు ఎత్తుకెళ్తాడు అంటూ సోషల్ మీడియాలో మరీ నీచంగా కామెంట్స్ వినిపించాయి .
అంతే కాదు చాలామంది ఇది రాంగ్ సెలక్షన్ అని మేకర్స్ ని ఆడేసుకుంటున్నారు… ఒకటి సాయి పల్లవి ని ఆ క్యారెక్టర్ నుండి మార్చండి, లేదంటే కాజల్ నైనా ఈ సినిమా నుంచి తీసేయండి వరుస కామెంట్స్ వచ్చాయి..దీంతో హీరోయిన్ కాజల్ అగర్వాల్ను రామాయణ ప్రాజెక్టు నుంచి తీసేసారు అన్న న్యూస్ బాగా వైరల్ అవుతుంది. కాజల్ ని ఎంపిక చేయక ముందు సీత పాత్రలో సాయిపల్లవి ఎంపిక సరైనది అని ఇలానే కామెంట్స్ వచ్చాయి..
