ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ గురించి ప్రేక్షకులలో భారీ అంచనాలు వున్నాయి.. ఈ పవర్ హౌజ్ కాంబినేషన్ ఏ రేంజ్ లో బ్లాస్ట్ చేస్తుందో చూసేందుకు ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ఫ్యాన్స్ కి మాసివ్ బ్లాక్ బస్టర్ ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నారు. దేవర తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఎన్టీఆర్ పాన్ ఇండియా మార్కెట్ లో అదరగొట్టాడు.. ఇప్పుడు అదే జోష్ తో బాలీవుడ్ డెబ్యూ సినిమా వార్ 2 ను కూడా పూర్తి చేసాడు…ఎన్నో అంచనాలు వున్న ‘వార్ 2’ మూవీ ఈ ఏడాది ఆగష్టు 14 న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.
హిట్ 3 : నెక్స్ట్ లెవెల్ వైలెన్స్ తో అదరగొట్టిన నాని.. టీజర్ మాములుగా లేదుగా..!!
ఇక తారక్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న ప్రశాంత్ నీల్ సినిమాను ఎన్టీఆర్ రీసెంట్ గా మొదలు పెట్టాడు.మైత్రీ మూవీ మేకర్స్ తో పాటు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు “డ్రాగన్” అనే పవర్ ఫుల్ టైటిల్ పరిశీలనలో ఉంది.కాగా ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ఇటీవల హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రశాంత్ నీల్ గ్రాండ్ గా మొదలు పెట్టాడు.. ఈ సినిమాకు సంబందించి అల్లర్లు , రాస్తారోకో షాట్స్ ను ప్రశాంత్ నీల్ తీస్తున్నారు. నెల రోజుల పాటు నీల్ తారక్ లేని సీన్స్ ను షూట్ చేయనున్నారు.
ఇక హైదరాబాద్ లో ఫస్ట్ షెడ్యూల్ ను ఫినిష్ చేసి సెకండ్ షెడ్యూల్ ను మొదలుపెట్టేందుకు ప్రశాంత్ నీల్ రెడీ అవుతున్నాడని సమాచారం… ఈ సెకండ్ షెడ్యూల్ షూటింగ్ కోసం వెస్ట్ బెంగాల్ లోని కోల్కతా కు చిత్ర యూనిట్ వెళ్లనుంది.ఈ సినిమా 1960లోని వెస్ట్ బెంగాల్ నేపధ్యంలో ఉండనుందని సమాచారం.. కోల్కతాలోనే సినిమాలోని మేజర్ సీన్స్ ను షూట్ చేయనుంది.ఇక ఆ తర్వాత మూడవ షెడ్యూల్ ను ఫారిన్ లో షూట్ చేయనున్నట్లు తెలుస్తుంది.. అందుకోసం ఏర్పాట్లు చేస్తున్నారు.ఇదిలా ఉంటే ఎన్టీఆర్ మార్చి 30న డ్రాగన్ డ్రాగన్ షూటింగ్ సెట్స్ లో పాల్గొననున్నట్లు సమాచారం..