ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ మూవీ “SSMB29”.. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ స్థాయికి పరిచయం చేసిన దర్శక ధీరుడు రాజమౌళి మొదటి సారి సూపర్ స్టార్ మహేష్ ని డైరెక్ట్ చేస్తున్నాడు.కెరీర్ మొత్తంలో బెస్ట్ మూవీస్ చేసిన రాజమౌళి ఇప్పుడు మహేష్ బాబుతో సరికొత్త వండర్ క్రియేట్ చేయబోతున్నాడు. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై వరల్డ్ వైడ్ సూపర్ బజ్ ఉంది. పాన్ ఇండియా మార్కెట్ లేని మహేష్ తో ఏకంగా పాన్ వరల్డ్ మూవీ చేసేందుకు రాజమౌళి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
హరిహర వీరమల్లు : ఆ సీన్స్ కి నెగటివ్ టాక్.. జాగ్రత్త పడుతున్న మేకర్స్..!!
అయితే ‘SSMB29’పై అంచనాలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ పాన్ వరల్డ్ యాక్షన్ అడ్వెంచరస్ మూవీలో మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఆయన తన తాజా చిత్రం ‘సర్జమీన్’ ప్రమోషన్లలో భాగంగా SSMB29 గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ..ఇప్పటివరకు ఎవ్వరూ ఊహించని విధంగా రాజమౌళి ఈ కథను తెరకెక్కిస్తున్నారు. ఇది ఓ అద్భుత దృశ్య కావ్యం. రాజమౌళి ఎంచుకునే ప్రతీ కథా భారీగా ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే… ఈ సినిమా కూడా అంతకు మించి ఉంటుంది.ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా మూవీ లవర్స్ కి ఓ విజువల్ ట్రీట్గా నిలవనుందని పృథ్వీరాజ్ సుకుమారన్ హామీ ఇచ్చారు.
ఈ సినిమాలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుంది.. దాదాపు 1000 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది..ఇది మహేశ్ బాబు కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ మూవీ.. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి రాజమౌళి బిగ్ అనౌన్స్మెంట్ చేయనున్నారు
