ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్లోని తన పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదంలో చిక్కుకొని గాయపడిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రమాదంలో మార్క్ శంకర్ చేతులు, కాళ్లకు బగాయాలు అయ్యాయి.. అలాగే మార్క్ శంకర్ పొగ పీల్చడం వల్ల స్వల్ప అస్వస్థతకు గురయ్యాడు.దీంతో సింగపూర్లోని ఒక ఆసుపత్రిలో చికిత్స అందించారు. పవన్ కుమారుడికి ప్రమాదం జరిగిందని తెలియగానే మెగా కుటుంబం హుటాహుటిన సింగపూర్ బయలుదేరి వెళ్ళింది.ప్రమాదం నుంచి బయట పడిన మార్క్ శంకర్ను పవన్ దంపతులు ఇండియాకు తిరిగి తీసుకొచ్చారు..దీంతో ప్రముఖులు అంతా పవన్ కుమారుడు మార్క్ శంకర్ ని పరామర్శించి వస్తున్నారు..
అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి : సెన్సార్ పూర్తి.. రన్ టైం ఎంతంటే..?
తాజాగా పవన్ కళ్యాణ్ ఇంటికి అల్లు అర్జున్ దంపతులు కూడా వెళ్లారు.ఈ నేపథ్యంలో మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకొన్ని, జరిగిన ప్రమాదం గురించి బన్నీ ఆరా తీశారు. అలా అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులతో దాదాపు గంటసేపు గడిపినట్లు తెలుస్తుంది. అయితే గత కొంత కాలంగా మెగా ఫ్యామిలీకి, అల్లు అర్జున్ మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయనే న్యూస్ తెగ వైరల్ అయింది.. ఫ్యాన్స్ కూడా రెండుగా విడిపోయి మరీ భారీగా ట్రోల్స్ చేసుకోవడం జరిగింది..ప్రస్తుతానికి అల్లు, మెగా ఫ్యామిలీ లో అందరూ కలిసి ఉన్నట్లు కన్నిప్పిస్తున్నప్పటికి, లోలోపల మాత్రం ఈ రెండు కుటుంబాల మధ్య వివాదాలు గట్టిగా సాగుతున్నట్టు ప్రచారం జరుగుతుంది.
పుష్ప-2 సినిమా తో బన్నీ ఇండస్ట్రీ హిట్ అందుకున్నా మెగా హీరోలు ఎవ్వరూ కూడా స్పందించలేదు. అలాగే అల్లు అర్జున్ అరెస్ట్ అయినప్పుడు కూడా మెగా ఫ్యామిలీ సపోర్ట్ లభించ లేదు.. అలాగే రీసెంట్ గా బన్నీ బర్త్డే కి కూడా ఎవ్వరు విషెస్ చెప్పకపోవడంతో ఈ వివాదాల వార్తలు తారాస్థాయికి చేరుకున్నాయి. అయితే ఇప్పుడు అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి మరీ అతని కుమారుడిని పరామర్శించడం అందరికీ షాక్ కలిగించింది..