ఫీనిక్స్ ఫౌండేషన్,శంకర్ ఐ హాస్పిటల్ సంయుక్తంగా తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 26 అనగా శనివారం నాడు తెలుగు ఫిలిం చాంబర్లో హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది.. ఈ కార్యక్రమంలో భాగంగా జర్నలిస్టులకు ‘ఐ స్క్రీనింగ్ పరీక్షలు కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ యంగ్ హీరో హీరో ప్రియదర్శి అలాగే టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ నాగ వంశీ, ఫీనిక్స్ గ్రూప్ డైరెక్టర్ అవినాష్ చుక్కపల్లి మరియు శంకర్ ఐ హాస్పిటల్ యూనిట్ హెడ్ విశ్వ మోహన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. హీరో ప్రియదర్శి, దర్శకుడు నాగ వంశీ రిబ్బన్ కట్ చేసి హెల్త్ క్యాంప్ ప్రారంభించారు…
AA22 : ఐకాన్ స్టార్ కి జోడిగా ఆ స్టార్ హీరోయిన్..!!
అనంతరం ఫీనిక్స్ గ్రూప్ డైరెక్టర్ అవినాష్ చుక్కపల్లి, శంకర్ ఐ హాస్పిటల్ యూనిక్ హెడ్ విశ్వమోహన్, TFJA ప్రెసిడెంట్ లక్ష్మీనారాయణ, వైస్ ప్రెసిడెంట్ రఘు, జనరల్ సెక్రటరీ వై.జె. రాంబాబు చేతుల మీదగా జ్యోతి ప్రజ్వలన జరిగింది..హెల్త్ క్యాంప్లో భాగంగా నటుడు ప్రియదర్శి కంటి పరీక్షలు కూడా చేయించుకున్నారు.ప్రియదర్శి కంటి దృష్టి చాలా పర్ఫెక్ట్ గా ఉందని వైద్యులు తెలిపారు. వైద్య పరీక్షల అనంతరం ఈ హెల్త్ క్యాంప్ గురించి నటుడు ప్రియదర్శి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు….. ”తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలుగు ఫిలిం ఛాంబర్లో నిర్వహించిన ఈ హెల్త్ క్యాంప్కు రావడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ క్యాంప్ నిర్వహిస్తున్న అసోసియేషన్ పెద్దలకు, ఫీనిక్స్ ఫౌండేషన్ అవినాష్ చుక్కపల్లి గారికి, శంకర్ ఐ హాస్పిటల్ మోహన్ గారికి ప్రియదర్శిని కృతజ్ఞతలు తెలిపారు. అలాగే జర్నలిస్టుల ఆరోగ్య విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటున్న అసోసియేషన్ పెద్దలకు కూడా ప్రియదర్శి స్పెషల్ థాంక్స్ చెప్పారు.. ప్రతి మనిషి ఆరోగ్యం పట్ల ఎంతో జాగ్రత్త తీసుకోవాలని ప్రియదర్శి తెలిపాడు.. ‘ఐ స్క్రీనింగ్’ హెల్త్ క్యాంప్లో జర్నలిస్టులు, వాళ్ల కుటుంబ సభ్యులు 100 మందికి పైగా ఉచితంగా కంటి పరీక్షలు చేయించుకున్నారు..