కేరళ బ్యూటీ మంజిమా మోహన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..చైల్డ్ ఆర్టిస్ట్గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ తన అద్భుతమైన నటనతో మంచి గుర్తింపు దక్కించుకుంది. ఆ క్రేజ్ తోనే ఈ అమ్మడు ‘ఓరు వడక్కన్ సెల్ఫీ’ మూవీతో హీరోయిన్గా మారింది.తమిళ, మలయాళ భాషల్లో పలు చిత్రాల్లో నటించిన ఈ భామ తక్కువ సమయంలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకుంది. ఈ భామ తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమే..
వెంకీ మామకు జోడిగా ఆ స్టార్ హీరోయిన్.. గురూజీ ప్లాన్ అదిరిందిగా..!!
తెలుగు లో ఈ భామ నాగ చైతన్య హీరోగా నటించిన ‘సాహసం శ్వాసగా సాగిపో’ సినిమాలో నటించి మెప్పించింది. ప్రస్తుతం మంజిమా తన పాత్రకు గుర్తింపు ఉంటే ఏ భాష సినిమాకి అయిన గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా, ఈ భామ ఇన్స్టాగ్రామ్ ద్వారా ఆనంద్ బాలసుబ్రమణ్యం రాసిన ది లార్డ్ ఆఫ్ వార్.. ది గాడ్ ఆఫ్ విస్డమ్ బుక్ను షేర్ చేసింది.ఈ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయింది..ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో రాబోతున్న ‘మురుగన్’ మూవీలో ఆమె హీరోయిన్గా నటిస్తున్నట్లు తెగ ప్రచారం జరుగుతుంది…రీసెంట్ గా అలాంటి బుక్ నే ఎన్టీఆర్ పట్టుకుని కనిపించిన సంగతి తెలిసిందే. ఈ బుక్ ఆధారంగానే ఎన్టీఆర్, త్రివిక్రమ్ మూవీ రాబోతున్నట్లు సమాచారం..
ఎన్టీఆర్ కోసం త్రివిక్రమ్ సరికొత్త సబ్జెక్టు సిద్ధం చేసినట్లు తెలుస్తుంది.. ఈ సినిమాను హారికా హాసిని నిర్మాణంలో నిర్మాత నాగావంశీ భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు…ఈ సినిమాలో మరిన్ని సర్ప్రైజింగ్ పాత్రలు ఉండనున్నట్లు సమాచారం.. త్వరలోనే ఫ్యాన్స్ అందరికీ మంచి కిక్ ఇచ్చే అప్డేట్ ఇవ్వనున్నట్లు సమాచారం..ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ షూటింగ్ లో బిజీగా వున్నాడు.. అలాగే ఎన్టీఆర్ నటించిన వార్ 2 ఈ ఆగస్టు 14 న భారీ స్థాయిలో రిలీజ్ కానుంది.
Actress Manjima Mohan posted story with
Muruga – The Lord of War 🔥@mohan_manjima @tarak9999 #NTRTrivikram #ManOfMassesNTR pic.twitter.com/2FFYWhhaD6
— NTR THE LEGEND (@NTRTHELEGEND) July 5, 2025
