ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ పుష్ప2 సినిమా సంచలన విజయం సాధించింది.. ఏకంగా 1800 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి రికార్డు క్రియేట్ చేసింది.. ఈ సినిమాతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా మారారు… పుష్ప 2 భారీ విజయం సాధించడంతో తన తరువాత సినిమాను పాన్ వరల్డ్ స్థాయిలో ఉండేలా ప్లాన్ చేసుకున్నాడు.ఈ నేపథ్యంలోనే కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ డైరెక్షన్ లో భారీ సినిమా చేసేందుకు అల్లుఅర్జున్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇటీవల ఈ సినిమాను మేకర్స్ అధికారకంగా ప్రకటించారు. కోలీవుడ్ బడా నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది..
జక్కన్న మహాభారతంలో ఆ ముగ్గురు స్టార్ హీరోస్ ఫిక్స్..?
తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో న్యూస్ వైరల్ అవుతుంది.. ఈ సినిమా యూనిట్ కు చెందిన అతి కొద్దీ మంది ముఖ్యుల సమక్షంలో అల్లు అర్జున్ , అట్లీ సినిమాకు సంభందించిన పూజా కార్యక్రమాలు ఇటీవల ముంబాయిలో చాలా సింపుల్ గా జరిగాయని తెలుస్తుంది. కాగా ఈ సినిమా షూట్ మొత్తం ముంబాయిలో అలాగే విదేశాల్లో ఉంటుందని సమాచారం. ఇప్పటికే దర్శకుడు అట్లీ ఫారిన్ లొకేషన్స్ కూడా లాక్ చేసినట్లు సమాచారం..ఈ సినిమాకు స్పైడర్ మ్యాన్, అవతార్, వాళ్వరిన్, టెర్మినేటర్ వంటి సినిమాలకు విజువల్ ఎఫెక్ట్స్ అందించిన ప్రముఖ VFX స్టూడియోస్, మోషన్ స్టూడియోస్ టెక్నిషియన్స్ వర్క్ చేయబోతున్నారని తెలుస్తుంది.అలాగే ఈ సినిమాలో హీరోయిన్ గా మృణాల్ ఠాకూర్, సమంత పేర్లు వినిపిస్తున్నాయి. కానీ మేకర్స్ మాత్రం ఇంకా ఎవరిని అధికారకంగా ఫిక్స్ చేయలేదు.అల్లుఅర్జున్ కెరీర్ లో 22వ సినిమా గా ఈ మూవీ తెరకెక్కుతుంది..