MOVIE NEWS

AA22: ట్రిపుల్ రోల్ లో ఐకాన్ స్టార్.. ఫ్యాన్స్ కి పండగే..?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప – 2 సినిమా గత ఏడాది డిసెంబర్ 5 న విడుదల అయి పాన్ ఇండియా వైడ్ సంచలనం సృష్టించింది.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ సంచలన విజయం సాధించింది..పుష్ప 2 చిత్రంతో సినిమా హద్దులను చెరిపేసిన అల్లు అర్జున్‌. ఇప్పుడు మరోసారి సంచలనం సృష్టించడానికి సిద్ధం అవుతున్నాడు.ఈ సారి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌లో అదరగొట్టేందుకు సిద్ధం అవుతున్నాడు… అల్లు అర్జున్‌ తన తరువాత సినిమాను స్టార్ డైరెక్టర్ అట్లీ డైరెక్షన్ లో చేయనున్నాడు.. మేకర్స్ ఈ సినిమాపై అధికారికంగా ప్రకటన కూడా ఇచ్చేసారు..

వీరమల్లు ట్రైలర్ రిలీజ్ పై స్టన్నింగ్ అప్డేట్.. మేకర్స్ ప్లాన్ అదిరిందిగా..!!

కోలీవుడ్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థ ‘సన్‌ పిక్చర్స్‌’ అత్యంత భారీ ఎత్తున ఈ చిత్రాన్ని నిర్మించడానికి ప్లాన్‌ చేస్తుంది. ఏప్రిల్ 8 అల్లుఅర్జున్ పుట్టినరోజు సందర్బంగా శుభాకాంక్షలు చెబుతూ.. ‘AA22’ పేరుతో ఈ చిత్రాన్ని మేకర్స్ ప్రకటించారు.కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ అట్లీ విజయ్‌ హీరోగా వరుస హిట్స్ అందుకొని ఇటీవల బాలీవుడ్‌కి వెళ్లి నటుడు షారుఖ్‌ ఖాన్‌తో జవాన్‌ అనే బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ తెరకెక్కించి అక్కడ కూడా సూపర్‌ హిట్‌ అందుకున్నాడు. అలా పాన్‌ ఇండియా రేంజ్‌లో సత్తా చాటి మంచి గుర్తింపు తెచ్చుకున్న అట్లీ.. అల్లుఅర్జున్ తో భారీ ప్రాజెక్ట్‌ చేస్తుండటంతో ఫ్యాన్స్ ఈ సినిమాపై ఊహించని స్థాయిలో అంచనాలు పెంచేసుకుంటున్నారు..

ఈ సినిమా లో అల్లు అర్జున్ ని దర్శకుడు అట్లీ సరికొత్త గా చూపించనున్నట్లు సమాచారం.. అలాగే ఈ సినిమాలో అల్లు అర్జున్ ట్రిపుల్ రోల్ రోల్ చేస్తున్నట్లు న్యూస్ వైరల్ అవుతుంది.ఇదిలా ఉంటే మొన్నటి వరకు ఈ సినిమాలో అల్లుఅర్జున్ డ్యూయల్ రోల్ అంటూ ప్రచారం జరిగింది. తాజాగా ట్రిపుల్ రోల్ న్యూస్ వైరల్ అవుతుంది.. మరి ఈ విషయంపై చిత్ర యూనిట్ అధికారికంగా స్పందించాల్సి వుంది..

Related posts

వీరమల్లు ఆగమనం సమ్మర్ లోనే.. కానీ రిలీజ్ లో స్వల్ప మార్పు..!!

murali

బన్నీ ఇష్యూలో సూపర్ ట్విస్ట్.. తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్న స్టార్ కమెడియన్..!!

murali

నా వల్లే షూటింగ్ 3 నెలలు లేట్ అయింది.. శ్రీకాంత్ షాకింగ్ కామెంట్స్..!!

murali

Leave a Comment