ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ పుష్ప2 సినిమా సంచలన విజయం సాధించింది.. ఏకంగా 1800 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి రికార్డు క్రియేట్ చేసింది.. ఈ సినిమాతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా మారారు… పుష్ప 2 భారీ విజయం సాధించడంతో తన తరువాత సినిమాను పాన్ వరల్డ్ స్థాయిలో ఉండేలా ప్లాన్ చేసుకున్నాడు.
తారక్ బర్త్డే.. ఫ్యాన్స్ కి స్పెషల్ ట్రీట్..!!
ఈ నేపథ్యంలోనే కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ డైరెక్షన్ లో భారీ సినిమా చేసేందుకు అల్లుఅర్జున్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇటీవల ఈ సినిమాను మేకర్స్ అధికారకంగా ప్రకటించారు. కోలీవుడ్ బడా నిర్మాణ సంస్థ సన్ పిచర్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది.అల్లు అర్జున్ , అట్లీ సినిమాకు సంబందించిన పూజా కార్యక్రమాలు ఇటీవల ముంబాయిలో చాలా సింపుల్ గా జరిగాయని తెలుస్తుంది. కాగా ఈ సినిమా షూటింగ్ మొత్తం ముంబాయిలో అలాగే విదేశాల్లో జరగనుందని సమాచారం. ఇప్పటికే దర్శకుడు అట్లీ ఫారిన్ లొకేషన్స్ కూడా లాక్ చేసినట్లు సమాచారం..అల్లుఅర్జున్ కెరీర్ లో 22వ సినిమా గా ఈ మూవీ తెరకెక్కుతుంది..
ఈ సినిమాకు ప్రముఖ హాలీవుడ్ VFX స్టూడియోస్, మోషన్ స్టూడియోస్ టెక్నిషియన్స్ వర్క్ చేయబోతున్నారని తెలుస్తుంది.అలాగే ఈ సినిమాలో అల్లు అర్జున్ డ్యూల్ రోల్ లో కనిపించబోతున్నాడని సమాచారం. హీరోతో పాటు విలన్ గా కూడా బన్నీ నటించబోతున్నాడని తెలుస్తుంది… ఇండియన్ సినిమా చరిత్రలో మునుపెన్నడూ కనిపించని విధంగా విలన్ రోల్ ను దర్శకుడు అట్లీ డిజైన్ చేశాడట. మరోవైపు ఈ సినిమాలో హీరోయిన్ గా లేటెస్ట్ గా అనన్య పాండే పేరు కూడా వినిపిస్తోంది.ఈ బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ ప్రొజెక్ట్ కు సంగీత దర్శకుడిగా అనిరుద్ తో పాటు సాయి అబ్యాంకర్ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తుంది..