మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటిస్తున్న బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ వార్ 2. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి ఎన్టీఆర్ స్క్రీన్ షేర్ చేసుకున్నారు. బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ ఈ సినిమాను గ్రాండ్ గా నిర్మిస్తుండగా అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నాడు.ఈ భారీ బడ్జెట్ మూవీ ఈ ఏడాది ఆగస్టు 14 న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. తెలుగులో ఈ సినిమాను సితార నాగవంశీ భారీ ధరకు కొనుగోలు చేసి రిలీజ్ చేస్తున్నారు.రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న ఈ సినిమాకు సరైన బజ్ లేకపోవడంతో స్టార్ నిర్మాత నాగవంశీ రంగంలోకి దిగారు.. ఆయన వార్ 2 కు సంబంధించి ఫ్యాన్స్ కు ఆడిపోయే అప్డేట్ ఇచ్చారు.
ఆంధ్ర కింగ్ తాలూకా : రామ్ రాత.. అనిరుధ్ పాట.. ఫ్యాన్స్ కి పండగే..!!
కింగ్డమ్ ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ’ వార్ 2 సినిమా లో ఎన్టీఆర్ ఎంట్రీకి థియేటర్లలో స్క్రీన్స్ చిరుగుతాయి.ఆ రేంజ్ లో ఉంటుంది తారక్ అన్న ఎంట్రీ సీన్ అని నాగవంశీ ఫ్యాన్స్ కి అసలైన ఎనర్జీ ఇచ్చారు.. ఆ సీన్ గురించి ఎక్కువ రివీల్ చేయకూడదు అంటూ నాగవంశీ ఫ్యాన్స్ లో ఇంటెన్షన్ పెంచారు… టైటిల్ తగ్గట్టు హృతిక్ రోషన్ మరియు ఎన్టీఆర్ కు మధ్య వార్ సీన్స్ విజువల్ వండర్ లా ఉంటాయి.
ఇద్దరు ఇండియాస్ బిగ్గెస్ట్ స్టార్స్ నువ్వా నేనా అని వార్నింగ్స్ ఇచ్చుకుంటూ కొట్టుకుంటుంటే చూసేందుకు ఎలా ఉంటది అనే యాంటిసిపేషన్ మీద వార్ 2 ను నేను కొనుగోలు చేశాను’ అని నాగవంశీ అన్నారు. ప్రస్తుతం నాగవంశీ కామెంట్స్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ జోష్ నింపింది.. మరోవైపు నాగవంశీ వార్ 2 రిలీజ్ కు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.
