టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. “SSMB” వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే ఈ సినిమా మూడు షెడ్యూల్స్ షూటింగ్ పూర్తి చేసుకుంది… ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది.
ప్రభాస్ ‘ది రాజాసాబ్’ లో మరో స్టార్ హీరోయిన్.. ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!!
ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషిస్తుండగా గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా మహేష్ సరసన హీరోయిన్ గా నటిస్తుంది.. అయితే ఈ సినిమాలో ఒకప్పటి స్టార్ హీరో కూడా భాగం కాబోతున్నట్టు సమాచారం..మహేష్ బాబు తండ్రి పాత్రలో ఒకప్పటి హ్యాండ్సమ్ హీరో మాధవన్ ని తీసుకోనున్నట్లు టాక్ వినిపిస్తుంది. మాధవన్ ఇటీవల కాలంలో విభిన్న పాత్రలు చేస్తూ ఎంతగానో మెప్పిస్తున్నాడు. దీంతో మహేష్ తండ్రిగా కాస్త ముసలి పాత్రలో మాధవన్ కనిపిస్తాడని.., అలాగే ఆయనకు ఫ్లాష్ బ్యాక్ కూడా ఉంటుదని సమాచారం..
గతంలో ఈ పాత్ర కోసం నానా పాటేకర్, విక్రమ్ లను అనుకోని ఇప్పుడు మాధవన్ ని ఫైనల్ చేసినట్టు సమాచారం..అయితే రాజమౌళి ఈ సినిమా గురించి ఎలాంటి అధికారిక ప్రకటనలు ఇవ్వడం లేదు..ఇదిలా ఉంటే త్వరలో ఈ సినిమా షూటింగ్ కి మూవీ యూనిట్ కెన్యా దేశానికి వెళ్ళనున్నట్లు సమాచారం…మహేష్ బర్త్డే ఆగస్టు నెలలో ఉండటంతో ఈ సినిమా కు సంబంధించి రాజమౌళి ఏదైనా బిగ్ అప్డేట్ ఇస్తారేమో అని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.. కచ్చితంగా ఆ రోజు అప్డేట్ వస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు..ఈ సినిమాను దాదాపు 1000 కోట్ల బడ్జెట్ తో బిగ్గెస్ట్ అడ్వెంచరస్ మూవీగా రాజమౌళి తెరకెక్కిస్తున్నారు..

అవకాశాలు పేరుతో నన్ను వాడుకుందాం అని చూసారు.. అనసూయ షాకింగ్ కామెంట్స్..!!