బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ ప్రస్తుతం వరుస సక్సెస్ లతో జోరు మీద వున్నాడు..రణ్ బీర్ గతంలో నటించిన యానిమల్ మూవీ పాన్ ఇండియా వైడ్ అద్భుత విజయం సాధించింది.. ప్రస్తుతం రణ్ బీర్ కపూర్ బిగ్గెస్ట్ మూవీలో నటిస్తున్నాడు.. రణ్ బీర్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ చిత్రం ‘రామాయణ’. ఏపిక్ మైథలాజికల్ చిత్రంగా రాబోతున్న ఈ సినిమాను నితేష్ తివారీ డైరెక్ట్ చేస్తున్నాడు.ఇప్పటి వరకు ఇండియన్ స్క్రీన్ పై ఎన్నో రామాయణ కథలు సినిమాలుగా వచ్చి సూపర్ హిట్ గా నిలిచాయి. త్వరలో మరెన్నో సినిమాలు తెరకెక్కనున్నాయి..
హరిహర వీరమల్లు : పవన్ విధ్వంసం.. ట్రైలర్ అదిరిపోయిందిగా..!!
ఇక ఇప్పడు లేటెస్ట్ గా బాలీవుడ్ లో రామాయణ ఇతిహాసంలో ‘రామాయణ’ అనే సినిమా తెరకెక్కుతుంది..రాముడిగా రణబీర్ కపూర్ నటిస్తుండగా సీతాదేవి పాత్రలో సాయి పల్లవి నటిస్తోంది. ఇక ఈ కథలో కీలకమైన రావణాసురిడి పాత్రలో కన్నడ స్టార్ హీరో యష్ నటిస్తున్నాడు. ఎటువంటి హంగు ఆర్భాటం లేకుండా మొదలు అయిన ఈ సినిమా షూటింగ్ ఎలాంటి అడ్డంకులు లేకుండా సాఫీగా జరుగుతోంది. కానీ ఈ సినిమా మొదలైనప్పటి నుంచి ఈ సినిమాకు సంబంధించి కనీసం ఒక్క పోస్టర్ ను కూడా మేకర్స్ రిలీజ్ చేయలేదు. రణబీర్ రాముడు పాత్రలో నటిస్తుండడంతో సినిమాపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి..
ఇతిహాస గాధ అయిన రామాయణ సినిమా ఎలా ఉంటుందా అని ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూసారు..తాజాగా మేకర్స్ చిన్న పాటి గ్లిమ్స్ వీడియోను తాజాగా రిలీజ్ చేసారు..పాత్రలు వారీగా పరిచయం చేస్తూ చివరిలో యష్ లుక్ ను చూపిస్తూ.. రాముడుగా రణబీర్ ఎంట్రీ చూపించారు.. ఈ చిన్న గ్లింప్స్ తో రామయణ సినిమా ఊహించిన దానికి మించి ఉండబోతుందని తెలుస్తోంది. ఏ ఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్న ‘ రామాయణ’ ఫస్ట్ పార్ట్ వచ్చే ఏడాది దీపావళి కానుకగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. సెకాండ్ పార్ట్ ను 2027 దీపావళి కానుకగా రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు..
