టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఆయన డైరెక్షన్ కి టాలీవుడ్ లో ప్రత్యేకమైన క్రేజ్ వుంది.. టాలీవుడ్ స్టార్ హీరోస్ అందరితో పూరీ బ్లాక్ బస్టర్ సినిమాలు చేసాడు.. పూరీ సినిమాలో హీరో క్యారెక్టరైజేషన్ ఎంతో కొత్తగా ఉంటుంది. అయితే ఆయన విజయ్ దేవరకొండ తో చేసిన లైగర్ సినిమా ఊహించని డిజాస్టర్ గా మారడంతో పూరీ కెరీర్ ఒక్కసారిగా డౌన్ ఫాల్ అయింది.. ఆ తరువాత రామ్ తో ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెల్ గా “డబుల్ ఇస్మార్ట్ “ ని తెరకెక్కించిన కూడా ప్రయోజనం లేకుండా పోయింది..
ప్రభాస్ ‘స్పిరిట్’ మూవీ బిగ్ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది ఎప్పుడంటే..?
ప్రస్తుతం ఏ స్టార్ హీరో కూడా పూరితో సినిమా చేయడానికి ఆసక్తి చూపించడం లేదు అయితే మ్యాచో స్టార్ గోపీచంద్తో పూరీ గతంలో బ్లాక్ బస్టర్ అయిన గోలీమార్ కు సీక్వెల్ తెరకెక్కిస్తున్నట్లు గతంలో ప్రచారం జరిగింది… అలాగే కింగ్ నాగార్జునతో కూడా పూరీ ఓ బిగ్ ప్రాజెక్ట్ సెట్ చేసుకున్నట్లు న్యూస్ వైరల్ బాగా అయింది.. కానీ అవేవి నిజం కావు….ప్రస్తుతం పూరీ ఎవ్వరు ఊహించని హీరోతో సినిమా చేస్తున్నాడు.. కోలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన విజయ్ సేతుపతితో పూరి జగన్నాథ్ తన తరువాత సినిమాను ఓకే చేసారు..
విలక్షణ నటుడుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న విజయ్ సేతుపతికి తెలుగులో సూపర్ క్రేజ్ ఉంది… ఇటీవల మహారాజా సినిమాతో అదిరిపోయే బ్లాక్ బస్టర్ అందుకున్న విజయ్ సేతుపతి చివరగా విడుదల పార్ట్ 2తో మెప్పించాడు.ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్న విజయ్ పూరీ సినిమాకు ఓకే చెప్పారు..అయితే ఈ సినిమాలో సీనియర్ హాట్ బ్యూటీ టబు కీలక పాత్ర పోషిస్తున్నట్లు న్యూస్ వైరల్ అయింది.తాజాగా ఆ న్యూస్ చిత్ర యూనిట్ కన్ఫామ్ చేసింది..టబుకి వెల్కమ్ చెబుతూ చిత్రబృందం తాజాగా ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టింది. టబు ఈ సినిమాలో టబు ముఖ్య పాత్రలో నటిస్తుంది..