టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో వెంకటేష్ నటించిన లేటెస్ట్ మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’.. స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ సంక్రాంతి కానుకగా ఏడాది జనవరి 14 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.. ఇప్పటికే వెంకీ, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో f2,f3 సినిమాలు తెరకెక్కగా ఆ రెండు సినిమాలు మంచి విజయం సాధించాయి..తాజాగా వచ్చిన “సంక్రాంతికి వస్తున్నాం” సినిమాతో వెంకటేష్- అనిల్ రావిపూడి కాంబో హ్యాట్రిక్ హిట్ కొట్టారు.. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.అ. కేవలం రూ. 50 కోట్లతో తెరకెక్కిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ రూ. 300 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ప్రాంతీయ భాషల్లో మాత్రమే విడుదలై 300 కోట్ల మార్క్ దాటిన తొలి తెలుగు సినిమాగా సంక్రాంతికి వస్తున్నాం మూవీ రికార్డ్ క్రియేట్ చేసింది.
మ్యాడ్ స్క్వేర్ : మరోసారి పక్కా ఎంటర్టైన్మెంట్ గ్యారెంటీ.. టీజర్ అదిరిపోయిందిగా..!!
అంతేకాదు వెంకటేష్ కెరీర్ లోనే ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచింది. ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు యూత్ ను కూడా ఎంతగానో ఆకట్టుకుందిఇది ఇలా ఉంటే ‘సంక్రాంతికి వస్తున్నాం’ అభిమానులకు డైరెక్టర్ అనిల్ రావిపూడి మరో బిగ్ సర్ప్రైజ్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
మార్చి 1న జీ తెలుగులో ప్రీమియర్ కాబోతున్న ఈ చిత్రంలో.. థియేటర్ లో డిలీట్ చేసిన సన్నివేశాలు కూడా యాడ్ చేయనున్నారట. దీంతో ఆడియన్స్ మరింత ఎంటర్ టైన్మెంట్ ఎంజాయ్ చేబోతున్నట్లు తెలుస్తోంది.అలాగే అదే రోజున జీ 5 ఓటీటిలో కూడా ఈ సినిమా స్ట్రీమింగ్ కు రానుందని తెలుస్తుంది..శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజ్ గ్రాండ్ గా నిర్మించిన ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరీ హీరోయిన్స్ గా నటించారు..