ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమాతో పాన్ ఇండియాలో పాపులర్ స్టార్ గా మారారు..పుష్ప సినిమాకు ముందు అల్లుఅర్జున్ కేవలం తెలుగు హీరో మాత్రమే.. పుష్ప సినిమా అల్లుఅర్జున్ కెరీర్ నే మార్చేసింది..అంతే కాదు ఇప్పటివరకు తెలుగు ఇండస్ట్రీలో ఏ హీరో అందుకోని నేషనల్ అవార్డును కూడా పుష్ప సినిమాలో అదిరిపోయే పెర్ఫార్మన్స్ తో అందుకున్నాడు..ఇక ‘పుష్ప 2’ సినిమాతో ఏకంగా ‘బాహుబలి 2’ రికార్డులను సైతం బద్దలు కొట్టి ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ.1900 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసి ఐకాన్ స్టార్ సరికొత్త రికార్డు క్రియేట్ చేశారు ఇప్పటికీ ఈ సినిమా థియేటర్లలో హౌస్ ఫుల్ గా రన్ అవుతోంది.
డాకు మహారాజ్ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది..బొమ్మ బ్లాక్ బస్టర్ గ్యారెంటీ..!!
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమాతో బన్నీ ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ఆల్ టైం రికార్డు క్రియేట్ చేశారు. ముఖ్యంగా ఇప్పటి వరకూ పుష్ప 2 కి వచ్చిన కలెక్షన్స్ లో దాదాపు సగానికి పైగా కలెక్షన్స్ కేవలం కేవలం నార్త్ నుండే రావడంతో అల్లుఅర్జున్ బాలీవుడ్ ఫోకస్ చేసినట్లు తెలుస్తుంది..పుష్ప2 సినిమా తర్వాత అల్లు అర్జున్ ప్రముఖ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో ఓ భారీ సినిమాను అనౌన్స్ చేసారు..మైథాలజికల్ బ్యాక్ డ్రాప్లో భారీ బడ్జెట్ తో ఈ సినిమాని రూపొందిస్తున్నట్లు సమాచారం.
ఈ ప్రాజెక్టు ఏప్రిల్ లో పట్టాలెక్కనుంది. ఈ సినిమా హిస్టారికల్ వారియర్ “చెంఘీజ్ ఖాన్” జీవిత కథ ఆధారంగా రూపొందుతోందని సమాచారం.ఇదే కాకుండా ఈ సినిమా తర్వాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో అల్లుఅర్జున్ ఒక సినిమా చేయాల్సి ఉంది. ఇదిలా ఉంటే ఈ క్రమంలో అల్లుఅర్జున్ బాలీవుడ్ లో బిగ్ ప్రాజెక్ట్ సెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది.. బాలీవుడ్లో దిగ్గజ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న సంజయ్ లీలా భన్సాలీతో అల్లు అర్జున్ భారీ సినిమా చేయనున్నట్లు సమాచారం.సంజయ్ లీల బన్సాలి ఇప్పటివరకు తీసిన సినిమాలన్నీ కూడా క్లాసిక్ మూవీస్ గా నిలిచిపోయాయి. సిల్వర్ స్క్రీన్ అనే కాన్వాస్ పై ఆయన చిత్రాలన్నీ గొప్ప కావ్యాలే అని చెప్పవచ్చు. ఇలాంటి సంజయ్ లీల తో అల్లు అర్జున్ సినిమా అంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు.. ఈ కాంబినేషన్ కనుక సెట్ అయితే మాములుగా ఉండదని ఫ్యాన్స్ సైతం భావిస్తున్నారు..