పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బిగ్గెస్ట్ హిస్టారికల్ మూవీ ‘హరిహర వీరమల్లు’.. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ సినిమాకు క్రిష్ జాగర్లమూడి, ఏ.ఎం. జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించారు.. దాదాపు ఐదేళ్ల క్రితం మొదలైన ఈ సినిమా ఎట్టకేలకు రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాను మేకర్స్ జులై 24 న గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు.పవర్ స్టార్ నుంచి ఛాన్నాళ్లకు ఓ భారీ మూవీ రానుండటంతో ఫ్యాన్స్ సైతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ప్రీమియర్ షోస్, టికెట్ రేట్స్ పెంపుకు అనుమతులు వచ్చాయి..
ఉస్తాద్ భగత్ సింగ్ : సెకండ్ హీరోయిన్ ఎంట్రీ.. తేరి రీమేక్ ఖాయమేనా..?
తాజాగా ఈ సినిమా ప్రీమియర్ షోలకు తెలంగాణ ప్రభుత్వం కూడా అనుమతి ఇచ్చింది.ఒకరోజు ముందుగానే సినిమా ప్రదర్శితం కానుంది. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. అలాగే, టికెట్ రేట్ల పెంపునకు కూడా తెలంగాణ ప్రభుత్వం ఓకే చెప్పింది.ఈ నెల 24న మూవీ రిలీజ్ కానుండగా… 23న రాత్రి పెయిడ్ ప్రీమియర్ షోలు వేసుకునేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఈ షోలకు టికెట్ ధర రూ.600 (జీఎస్టీ +) ఉండనుంది. అలాగే, ఈ నెల 24 నుంచి 27 వరకూ ఐదు షోలకు అనుమతి ఇచ్చింది. మల్టీ ప్లెక్స్ లో అయితే రూ.200 (జీఎస్టీ +), సింగిల్ స్క్రీన్లలో రూ.150 (జీఎస్టీ +) పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించింది.ఈ నెల 28 నుంచి ఆగస్ట్ 2 వరకూ ఐదు షోలు వేసుకునేందుకు అనుమతి ఇస్తూనే… మల్టీ ప్లెక్స్ లో రూ.150 (జీఎస్టీ+), సింగిల్ స్క్రీన్లలో రూ.106 (జీఎస్టీ +) వరకూ టికెట్ ధరలు పెంచుకునేందుకు వీలు కల్పించింది.
