మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో బిగ్గెస్ట్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. మైత్రీ మూవీ మేకర్స్ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీకి మేకర్స్ ‘డ్రాగన్’ అనే పవర్ ఫుల్ టైటిల్ పరిశీలిస్తున్నట్లు సమాచారం.ఈ సినిమాలో ఎన్టీఆర్ కి జోడీగా కన్నడ బ్యూటీ రుక్మిణీ వసంత్ నటిస్తున్న సంగతి తెలిసిందే..సౌత్ భామల్ని హీరోయిన్లగా ఎంపిక చేయడం అన్నది ప్రశాంత్ నీల్ కి సెంటిమెంట్. `కేజీఎఫ్` లో శ్రీనిధి శెట్టి ఆ విధంగానే ఛాన్స్ అందుకుంది. అలాగే `సలార్` లోనూ శ్రుతి హాసన్ కి అలాగే అవకాశం వచ్చింది.`డ్రాగన్` పుణ్యమా అంటూ రుక్మిణీ వసంత్ కి తెలుగు ఆఫర్లు వెల్లువలా వచ్చి పడుతున్నాయి.
నిర్మాతలు అడ్వాన్స్ లు కూడా చెల్లించడానికి రెడీగా ఉన్నారు. ఇంకా ఈ సినిమాలో చాలా కీలక పాత్రలు కనిపించనున్నట్లు సమాచారం. ఇదే చిత్రంలో తెలుగు నటి ఆనంది కి కూడా ఛాన్స్ వచ్చిందని సమాచారం… అమ్మడిని ఓ కీలక పాత్ర కోసం ఎంపిక చేసినట్లు తెలుస్తుంది..ప్లాష్ బ్యాక్ లో వచ్చే కొన్ని సన్నివేశాల్లో ఆనంది పాత్ర కీలకంగా ఉంటుందని సమాచారం.ఇదే కనుక నిజమైతే ఆనంది కెరీర్ టర్నింగ్ అయినట్లే.. ఇప్పటికే తెలుగు, తమిళ్ లో ఈ భామ చాలా సినిమాలు చేసింది.
కానీ స్టార్ హీరోల చిత్రాల్లో అవకాశాలకు మాత్రం దూరంగానే ఉంది. ట్యాలెంటెడ్ బ్యూటీ అయిన సరైన అవకాశాలు రాకపోవడంతో పెద్దగా ఫేమ్ రాలేదు.. డ్రాగన్ అవకాశం గనుక నిజమైతే ఆనంది కెరీర్ కొత్త టర్నింగ్ తీసుకుంటుంది. ఇటీవలే రిలీజ్ అయిన `భైరవం`లో ఆనంది నటించిన సంగతి తెలిసిందే. కానీ ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేదు..
