పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ హరిహర వీరమల్లు పార్ట్ 1 స్వోర్డ్ వర్సెస్ స్పిరిట్ ఈ నెల 24న గ్రాండ్ గా థియేటర్లలో రిలీజ్ కానుంది.క్రిష్ జాగర్లమూడి, జ్యోతి క్రిష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ప్రతిష్టాత్మక చిత్రం గత కొన్నేళ్లుగా షూటింగ్ వాయిదా పడుతూ ఎట్టకేలకు రిలీజ్ కి సిద్ధం అయింది..ఈ భారీ పాన్ ఇండియా మూవీ తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు.పవన్ సినిమా కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కోసం నిర్మాత ఏఎం రత్నం ఒక పెద్ద సర్ప్రైజ్ ప్రకటించారు. జూలై 23 రాత్రి 9:30 గంటలకు దేశవ్యాప్తంగా ప్రత్యేక ప్రీమియర్ షోలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆయన తెలిపారు.
‘విశ్వంభర’ స్టోరీ చెప్పేసిన వశిష్ఠ.. ఆ సినిమాలే ఇన్స్పిరేషన్..!!
ఇందుకోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాల అనుమతులు, అలాగే టికెట్ ధరల పెంపు కోసం కూడా అనుమతులు తీసుకుంటున్నామని ఆయన వెల్లడించారు. సినిమా విడుదలకు ముందు జూలై 21న హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరగనుంది.ఈ వేడుకకు ఎస్ఎస్ రాజమౌళి, త్రివిక్రమ్ శ్రీనివాస్, కర్ణాటక మంత్రి ఈశ్వర్ ఖండ్రే, అలాగే మరికొందరు ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉందని ఆయన తెలిపారు.ఫ్యాన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ఈవెంట్ సినిమాపై హైప్ను మరింత పెంచనుంది.
ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ సరసన హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించగా బాలీవుడ్ స్టార్ బాబీ డోయల్ మొఘల్ చక్రవర్తి గా నటించారు. ఆస్కార్ విన్నర్ ఎం.ఎం కీరవాణి అందించిన మ్యూజిక్ సినిమాకు మరింత ప్లస్ గా మారింది..
