నందమూరి కళ్యాణ్రామ్ హీరోగా నటించిన “బింబిసార” సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సోషియో ఫాంటసీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా మంచి కలెక్షన్లు సాధించడంతో పాటు నందమూరి కళ్యాణ్ రామ్ కెరీర్లోనే ది బెస్ట్ మూవీగా నిలిచింది..ఈ సినిమాకు యంగ్ డైరెక్టర్ వశిష్ట దర్శకత్వం వహించాడు. మొదటి సినిమా అయినా కూడా వశిష్ఠ తెరకెక్కించిన విధానం ప్రేక్షకులకు బాగా నచ్చింది. అయితే ఈ సినిమా అనంతరం దీనికి సీక్వెల్ను ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆ ప్రాజెక్ట్ను వశిష్ట కాకుండా కొత్త దర్శకుడు అనీల్ పదురీ తెరకెక్కిస్తున్నాడు. అయితే ఈ ప్రాజెక్ట్ నుంచి తాను తప్పుకోవడానికి గల కారణాన్ని దర్శకుడు వశిష్ట వెల్లడించాడు..
హరిహర వీరమల్లు : వేదిక మారింది.. ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడంటే..?
ఆయన మాట్లాడుతూ.. ‘బింబిసార 2’ కి అనీల్ పదురీ మంచి కథ రాశాడు. దీంతో నేను ఈ ప్రాజెక్ట్ చేస్తే సెట్ అవ్వదు అని అనిపించింది. అందుకే ఈ ప్రాజెక్ట్ను అనీల్ తెరకెక్కిస్తున్నాడని వశిష్ఠ తెలిపారు… అనీల్ నా కంటే బెటర్గా తీస్తాడనే నమ్మకం ఉంది కనుకనే నాతో పాటు కళ్యాణ్ రామ్ అతడే బెటర్ అని ఫిక్స్ అయ్యామని వశిష్ఠ తెలిపారు… త్వరలోనే ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకి వెళ్లనున్నట్లు కూడా తెలిపారు.. వశిష్ట ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో ‘విశ్వంభర” అనే బిగ్గెస్ట్ సోషియో ఫాంటసీ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశ లో వుంది. త్వరలోనే ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది..
బింబిసార సినిమాకి మీడియం బడ్జెట్ అయిన అద్భుతంగా తెరకెక్కించిన వశిష్ఠ మెగాస్టార్ సినిమాకు యూవి క్రియేషన్స్ భారీ బడ్జెట్ అందించడంతో మరింత రిచ్ గా అద్భుతమైన విజువల్ వండర్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు…
